ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పరిశీలించారు.

ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గోదాం పరిసర ప్రాంతాల భద్రత, రికార్డుల నిర్వహణ, సీలింగ్ ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!