బస్సు – బైకు ఢీకొని తల్లీ కూతుర్లు మృతి

 

డోన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :- నంద్యాల జిల్లా,బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది .ఈ ప్రమాదంలో లక్ష్మి(20), మానస (2), అక్కడక్కడ మృతి చెందారు.మృతి చెందిన బంధువుల వివరాల మేరకు ప్యాపిలి(మం) అలెహబాద్ పల్లె గ్రామానికి చెందిన మనోహర్ (తండ్రి), లక్ష్మి ( తల్లి), మానస( కూతురు), కలిసి పుట్టింటికి వస్తుండగా దద్దనాల ప్రాజెక్టు వద్ద ఎల్లార్తికి వెళ్తున్న బనగానపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొని తల్లి, కూతురు అక్కడక్కడ మృతి చెందారు. బనగానపల్లె పోలీసులు ఘటనా స్థలం చేరుకొని మృతి చెందిన వారిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!