మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలోని సోమారిపీట్ గ్రామంలోని మాజీ ఎంపీటీసీ మరెపు లక్ష్మి నారాయణ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. మీ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మాజీ రైతుబంధు కన్వీనర్ భూక్యా నర్సింలు, గజ్యా నాయక్ తండా మాజీ సర్పంచ్ హంజి నాయక్, మాజీ కో అప్షన్ సభ్యుడు అబ్దుల్, ఉప్పసర్పంచ్ తొకల కిషన్, మల్లేష్, శ్రీనివాస్,దేవరాజు, రాజేశ్వర్, హేమ్లా నాయక్,సోషల్ మీడియా ఇంచార్జ్ ఎజాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


