కన్నాలలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
బెల్లంపల్లి,ఆగస్టు 7అఖండ భూమి న్యూస్):పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.మండల ఇన్చార్జి కృష్ణపల్లి రాజలింగు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మిట్టపల్లి మల్లయ్య మాదిగ,గోగర్ల రాజేశం మాదిగ పాల్గొన్నారు.సంస్థను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసి, సామాజిక హక్కుల సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు…



