తల్లిపాలే శిశువుకు శ్రేయస్సు

హనుమాన్బస్తీ అంగన్వాడిలో తల్లిపాల వారోత్సవాలు
బెల్లంపల్లి ఆగస్టు,6(అఖండ భూమి న్యూస్):ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ–1 అంగన్వాడి కేంద్రంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 31వ వార్డు కౌన్సిలర్ బండారి స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు బ్రెడ్,అరటిపండ్లు పంపిణీ చేశారు.అనంతరం కౌన్సిలర్ బండారి స్రవంతి మాట్లాడుతూ.. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని తెలిపారు.ప్రతి తల్లి బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని,తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ సందర్బంగా అంగన్వాడి సూపర్వైజర్ ప్రసన్న మాట్లాడుతూ…పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లిపాలే బిడ్డకు తొలి టీకా అని, తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి–బిడ్డల మధ్య అనుబంధం బలపడటంతో పాటు తల్లుల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు.
తల్లిపాల విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమాజంలో అవగాహన కల్పించాలని లయన్స్ క్లబ్ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో గర్భిణీలు,బాలింతలతో పాటు అంగన్వాడి టీచర్లు స్వరూప, రాజేశ్వరి,పద్మావతి,విజయలక్ష్మి, కనకతార,భారతి,ఉమాదేవి,సుజాత, ఆయా సునీత తదితరులు పాల్గొన్నారు…


