యర్రగొండపాలెం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి

యర్రగొండపాలెం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి

 

యర్రగొండపాలెం అఖండ భూమి:పశ్చిమ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని యర్రగొండపాలెంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ కోరారు. ఈ మేరకు సోమవారం ఒంగోలు నగకంలో కలెక్టరేట్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్. అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ముస్లిం యూత్ సొసైటీ ద్వారా రెండు వేల మందికి పైగా వివిధ ప్రమాదవశాత్తు రోగులకు రక్తదానం. చేసినట్లు చెప్పారు. ఈ సేవా కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందంగా, మానవతా దృక్పథంతో జరిగిందని తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు, గర్భవతి మహిళలకు తక్షణ అవసరమైన రక్తం లభ్యం కావడంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉ న్నాయన్నారు. ఫలితంగా వైద్య సేవల్లో రక్తం అందక ప్రాణాలు పోతున్న ఘటనలు మన కళ ముందే జరుగుతున్నాయని వివరించారు. రక్తం అందించే ఏర్పాట్లు లేకపోవడం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యర్రగొండపాలెంలో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ప్రాణవాయువుగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి మంజూరు చేయాలని ఆయన కోరారు. వినతిపత్రం స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా విచారించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!