పేదల సంక్షేమమే నా ధ్యేయం – ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలోని వెంకటమ్మ & ప్రభు కుటుంబ పరిస్థితి చూసి ఆ *కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజా పాలన,ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లును మంజూరూ చేయించారు, సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వెంకటమ్మ & ప్రభు దంపతులు గృహప్రవేశానికి *ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, “ ఇల్లు లేని ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం నా కల. మాన నియోజకవర్గానికి మొత్తం 3500 ఇళ్లు మంజూరయ్యాయి. వేగంగా పనులు పూర్తి చేస్తున్నాం” అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఇతర ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ. గత 15 సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి *ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషి వల్ల ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, తాము కన్నా కళ నిజమైందని ఈ సహాయం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. తమకు ఇల్లు మంజూరు చేసినందుకు జీవితాంతం *ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి, సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


