మీడియా వాహనంపై ఎంపీ అవినాష్ అనుచరుల దాడి
హైదరాబాద్: వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్లో ఓ మీడియా సంస్థకు చెందిన వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు హాజరుకాకుండా పులివెందుల వెళ్తున్న అవినాష్ వాహనాన్ని మీడియా వాహనం అనుసరించింది. దీంతో ఎంపీ అనుచరులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రిపోర్టర్కు గాయాలు కాగా.. వాహనం ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి..