దోమకొండలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బక్రీద్ పండగ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దోమకొండ లో హిందువులు తో కలిసి ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ తెలుపుతూ కరచాలనం చేశారు. అనంతరం అందరికీ ఆహ్వానించి తీపి పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐరేని నరసయ్య , అనంతరెడ్డి, ఆశ బోయిన శ్రీనివాస్ , తీగల తిరుమల గౌడ్, ఆబ్రబోయిన స్వామి, అండెం శంకర్ రెడ్డి , నల్లపు శ్రీనివాస్ , సీతారాం మధు, బొమ్మర్ శ్రీనివాస్ ,కదిరే గోపాల్ రెడ్డి, ఆబ్రబోయిన రాజేందర్ , అప్పుడు అబ్రబోయిన రాజు, మల్లేష్ యాదవ్, షమ్మీ, నహిం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
కొనుగోలు కేంద్రాలలో ముస్లిం సోదరులకు రవాణా చార్జీలు అందిస్తున్న కలెక్టర్…
బక్రీద్ పండగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం విలువలను గుర్తుచేస్తుంది…
ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ…
31న ఖర్చుక బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశానికి స్వచ్ఛందంగా తరలి రావాలి…
గణిత శాస్త్ర అధ్యాపకురాలు కస్ప శ్రీలత కు డాక్టరేట్


