జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో 93 దరఖాస్తుల స్వీకరణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని ప్రజల నుండి సోమవారం దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 93 దరఖాస్తులు వచ్చాయని భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, గృహాలు, రెవెన్యూ , ఇతర శాఖలకు సంబంధించిన వినతులు ప్రజలు సమర్పించారు.
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్.వి గిరి, జెడ్పీ సీఈవో చందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


