*రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ చోరీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);
రైలు ప్రయాణంలో ఏసీ కోచ్ ప్రయాణికులు కొందరు రైల్వే బెడ్ రోల్ సామగ్రిని భారీగా ఎత్తుకెళ్తున్నట్లు ఆర్.టి.ఐ ద్వారా వెల్లడైంది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు దేశవ్యాప్తంగా దాదాపు 1.27 కోట్ల వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇందులో 46.54 లక్షల ఫేస్ టవల్స్, 41.13 లక్షల బెడ్ షీట్లు, 12.95 లక్షల దుప్పట్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.104 కోట్లు ఉంటుందని అంచనా.


