టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్);
_తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. దాతల దర్శన సౌకర్యాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానుండటంతో పాత ప్రయోజనాలను పొందేందుకు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. దీంతో కేవలం 10 గంటల వ్యవధిలోనే ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల ద్వారా మొత్తం 2,460 మంది దాతలు కలిపి రూ.97 కోట్ల విరాళాలు అందజేసి అపూర్వ ఘట్టానికి కారణమయ్యారు. ఇందులో ఇద్దరు భక్తులు తలో రూ.1 కోటి చొప్పున విరాళం సమర్పించడం విశేషం. ఈ స్థాయిలో ఒకే రోజులో విరాళాలు రావడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం._
You may also like
సర్కారు పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి…
షబ్బీర్ అలీని కలిసిన మాచారెడ్డి మండల సర్పంచ్ లు…
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బూమ్ పల్లి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు…
వందేమాతర గీతానికి రక్షణలు…
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…


