కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 16 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో కాకి వాగుపై నిర్మించనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కంబాపూర్ గ్రామంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి గ్రామంలో బోరు వేయించి ప్రజలకు తాగునీటి సమస్యలు కలుగకుండా సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…
ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత…


