రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
*ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం..
*రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 16 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శివలీల (55) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా చెందిన శ్రీహరి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీహరి సేవలు అభినందనీయమని,తోటి మనిషి ప్రాణాలను కాపాడడం కోసం నిస్వార్ధంగా రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నామని,తల సేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఆగస్టు నెలలో నిర్వహిస్తామని అన్నారు ప్రతి 15 రోజులకు ఒకసారి కావాల్సిన రక్తం చిన్నారులకు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో గురి అవుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది వరకు చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.రక్తదాతకు అభినందనలు తెలిపారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…
ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత…


