సింగిరాయపల్లిలో 10 లక్షల సిసి రోడ్డు పనులు ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ సహకారంతో శనివారం రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ లతా అంజన్న ప్రారంభించారు. గ్రామంలో 10 లక్షల రూపాయలతో రోడ్డు పనులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ కి, రమేష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


