అనుమతి లేకుండా హోటల్ లో మద్యం విక్రయిస్తున్న అధికారులు దాడులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీలోని హోటళ్లపై అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న సమాచారం మేరకు దాడులు శనివారం నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా గల లక్ష్మీ మెస్ లో అనుమతి లేకుండా మద్యం తాగిపిస్తూ మెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి లింబయోల దిలీప్ రెడ్డి పై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీ లోని హోటల్లో, మెస్ లలో, దాబాల యందు అనుమతి లేకుండా మద్యం విక్రయాలు జరిగినా మద్యం సేవించుటకు అనుమతించిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని , ఎటువంటి సమాచారం ఉన్న మాకు తెలియజేయాలని ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ దాడులలో సీఐ సంపత్ కృష్ణ , ఎస్సై విక్రంకుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్ , కానిస్టేబుల్స్ రాజు, దినేష్ లు పాల్గొన్నారు.
You may also like
సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలి…
14వ వార్డ్ లో ప్రైమరీ స్కూల్లో అవగాహన కల్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ…
సింగిరాయపల్లిలో 10 లక్షల సిసి రోడ్డు పనులు ప్రారంభం…
కామారెడ్డిలో టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ విజయగాథల పుస్తకావిష్కరణ…
సర్కారు పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి…


