Warangal: హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
వరంగల్: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య టిప్పర్.. కారు ఢీకొన్నాయి..
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..



