మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి..

 

Buggana: మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి..

బేతంచర్ల: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది..

తేనెటీగల దాడిలో సుమారు 70 మందికి గాయాలయ్యాయి. బుగ్గనకు ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని బేతంచర్ల శేషారెడ్డి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బుగ్గన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!