కేంద్ర మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ..

 

Chandrababu: కేంద్ర మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ..

అమరావతి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేశ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కోరారు..

అద్దంకికి చెందిన రాజేశ్‌.. ఇటీవల ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. బీచ్‌లో తన పిల్లలను రక్షించే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌ భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెచ్చేందుకు సహకారం అందించాలని కేంద్రమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..

Akhand Bhoomi News

error: Content is protected !!