Vizag: డ్రైవర్ను చితకబాది.. బియ్యం లారీతో ఉడాయించిన దుండగులు..
మాధవధార: విశాఖ నగర పరిధిలో బియ్యం లారీని దుండగులు ఎత్తుకెళ్లారు. డ్రైవర్ను చితకబాది లోడుతో ఉన్న లారీని తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..
విశాఖ ఎయిర్పోర్టు దాటిన తర్వాత గాజువాక వైపు వెళ్తున్న బియ్యం లారీని ముగ్గురు దుండగులు ఆపారు. అనంతరం డ్రైవర్ను చితకబాది అతడి వద్ద ఉన్న కొంత నగదు, లారీతో ఉడాయించారు. డ్రైవర్ ఫిర్యాదుతో కంచరపాలెం పోలీసుల కేసు నమోదు చేశారు. సీఐ కాంతారావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది..


