కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం లో పిడుగు పడి గంపా సత్యవతి (26) అనే వివాహిత మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ఆమె మరణ వార్తను విన్న గ్రామస్తులు బందువులు కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో మునిగిపోయారు మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టుమూరి గోవింద్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించు కోవడం కోసం పొలాల్లోకి కూలి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా భర్త పిల్లలు పడే కన్నీటి రోధన ను చూసి తీవ్ర దిబ్భ్రాంతికి లోనయ్యానని ఆయన అన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు వాహన సహాయం అందక మృతురాలి బందువులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం కుటుంబానికి నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
You may also like
-
చెర్లో పాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు.
-
కొత్త నాయుడుపాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు
-
అయ్యన్న జన్మదిన సందర్భంగా రోడ్డు శ్రమదానం చేస్తున్నకూండ్రపు
-
ఎస్సీ వర్గీకరణ వద్దు -ఎస్సీల రిజర్వేషన్ కోటా పెంచండి – మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ చిట్టుమూరు గోవింద్ డిమాండ్
-
అల్లిపూడి లో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు