కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం లో పిడుగు పడి గంపా సత్యవతి (26) అనే వివాహిత మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ఆమె మరణ వార్తను విన్న గ్రామస్తులు బందువులు కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో మునిగిపోయారు మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టుమూరి గోవింద్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించు కోవడం కోసం పొలాల్లోకి కూలి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా భర్త పిల్లలు పడే కన్నీటి రోధన ను చూసి తీవ్ర దిబ్భ్రాంతికి లోనయ్యానని ఆయన అన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు వాహన సహాయం అందక మృతురాలి బందువులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం కుటుంబానికి నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


