పిడుగు పాటు తో మృతి చెందిన వివాహిత కుటుంబాన్ని ఆదుకోండి – మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టుమూరి గోవింద్

కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం లో పిడుగు పడి గంపా సత్యవతి (26) అనే వివాహిత మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ఆమె మరణ వార్తను విన్న గ్రామస్తులు బందువులు కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో మునిగిపోయారు మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టుమూరి గోవింద్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించు కోవడం కోసం పొలాల్లోకి కూలి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా భర్త పిల్లలు పడే కన్నీటి రోధన ను చూసి తీవ్ర దిబ్భ్రాంతికి లోనయ్యానని ఆయన అన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు వాహన సహాయం అందక మృతురాలి బందువులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం కుటుంబానికి నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు

Akhand Bhoomi News

error: Content is protected !!