కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం లో పిడుగు పడి గంపా సత్యవతి (26) అనే వివాహిత మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ఆమె మరణ వార్తను విన్న గ్రామస్తులు బందువులు కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో మునిగిపోయారు మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టుమూరి గోవింద్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించు కోవడం కోసం పొలాల్లోకి కూలి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా భర్త పిల్లలు పడే కన్నీటి రోధన ను చూసి తీవ్ర దిబ్భ్రాంతికి లోనయ్యానని ఆయన అన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు వాహన సహాయం అందక మృతురాలి బందువులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం కుటుంబానికి నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్