అటవీశాఖ అధికారుల కు డబ్బులు ఇచ్చినామన్న మాట ఆవాస్తవం శ్రీశైలం నవంబర్ 28 (అఖండ భూమి) : మహా పుణ్యక్షేత్రం కు చేరువలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద అడవి పండ్లు, సోడాలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్న మాకు అటవీశాఖ అధికారుల కు డబ్బులు ఇచ్చినా మన్న మాట అవస్తవమని సుండి పెంట వాస్తవ్యులు ఎలకపాటి జ్యోతి, కుమారీ అను మహిళలు తెలిపారు. సహాయం చేయాలని అటవీశాఖ అధికారులను మేము వేడుకుంటే మాకు బ్రతుకుతెరువుకు అవకాశం కల్పించారని చెప్పారు. అటవీ శాఖ అధికారులకు మేము డబ్బులు ఇచ్చినామని అవాస్తవంగా ప్రచారం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మేము ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలియజేస్తున్నామన్నారు. ఆలయం వద్ద అటవీ పండ్లు అమ్ముకుంటే కుటుంబం జరిగే పరిస్థితిలో ఉన్న మేము అధికారులకు లంచాలు ఇచ్చినామని ప్రచారం చేయడం సరికాదని తెలిపారు. ఆలయం వద్ద అటవీ పండ్ల అమ్ముకునే మమల్ని అటవీశాఖ అధికారులు ఇక్కడ ఉండవద్దని తెలపడంతో మా యొక్క పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. మా యొక్క పేద కుటుంబాల పై అటవీశాఖ అధికారులు దయచేసి మాకు సాక్షి గణపతి ఆలయం వద్ద మరల అమ్ముకు నేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


