నాగర్ కర్నూల్: చనిపోయిందనకున్న మహిళ ను సి.పి.ఆర్.చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తన ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసించి,సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ మల్లేష్ ను సన్మానించారు.ఈ సదర్భంగా జిల్లా కలెక్టరు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సి.పి.ఆర్.పైన ప్రతి ఒక్కరికీ అవగాహణ కలిగి ఉండాలనీ సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ప్రతి ఒక్కరూ కానిస్టేబుల్ మల్లేష్ లా తయారవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా కె సుధాకర్ లాల్,డి.పి.ఓ రెనయ్య, డి.డి. ఎమ్.సందీప్ పాల్గొన్నారు.

