అభివృద్ధి సోపానాలు మన నమ్మకం…
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17,(అఖండ భూమి న్యూస్)
మనిషి గొప్పవాడు కావాలని నిరంతరం కలలు కంటుంటాడు.
ధనాశ కలిగినవాడు కుబేరు ణ్ని మించి పోవాలనుకుంటా డు. అధికారదాహం కలవాడు అత్యున్నత స్థాయి కుర్చీని ఆక్ర మించు కోవాలనుకుంటాడు. జ్ఞాని పరమ జ్ఞానిగా, సాధకు డు సిద్ధుడిగా,శూరుడు యోధుడిగా, వైద్యుడు ధన్వంతరి సమంగా ఇలా ఉంటాయి ఆశల కలలు. కలలు వేరు, వాస్త వం వేరుధాన్యాన్ని సంచుల్లోనే ఉంచుకుని, పదింతల పంట కోసం కలలు కనడం ఎంతవ రకు సబబు, హలాలతో పొలా లు దున్ని భూమాతను నమ్ము కుని తగినంతగా కృషి చెయ్యా ల్సి ఉంటుంది.కలలు కృషితో జత కలిసినప్పుడే సత్ఫలితా లు లభిస్తాయి. ఉద్యోగి తన ప్రజ్ఞకు పదును పెట్టుకుంటూ, అంకిత భావంతో పనిచేసినప్పు డే పదోన్నతులు లభిస్తాయి. తన కళ్లముందు తనకంటే వెన కవాళ్లు అభివృద్ధి సోపానాలు ఎక్కుతుంటే అసూయతోరగిలి పోవడం మన ఆరోగ్యానికే చేటు. అలాగే విద్యార్థులు కూడా. అమూల్యమైన సమయాన్ని ఆటపాటలు, వినోదాలతో వ్యర్థం చేసుకుంటే ఉత్తీర్ణతే కష్టం కావచ్చు. ఇక ఉన్నతశ్రేణికి అవకాశం ఎలా ఉంటుంది? గతించిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిరా దు. సర్వసమర్థుడైన భగవం తుడైనా కాలాన్ని వెనక్కి తిప్ప డు. కోట్లాదిరూపాయలు గుమ్మరించినా గతించిన క్షణాల్ని తిరి గిపొందడం అసాధ్యం. కానీ, చాలామంది ఈ సత్యాన్ని గమనికలోకి తీసుకోరు.నేను చాలా తప్పులు చేశాను. తల్లి దండ్రుల్ని హింసలుపెట్టాను. ఒక్కసారి వారికి మళ్ళీ సేవలు చేసే అవకాశం ఇవ్వు భగ వం తుడా’ అని ఎంత మొత్తు కు న్నా- పోయినవాళ్లు మళ్ళీ ప్రత్యక్షం కారు.సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే సద్విని యోగం చేసుకోవాలి. ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలి.యౌవనంలో ఉండగానే తీర్థయాత్ర లు చేయాలి. బాలుడిగా ఉన్న ప్పుడే శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. మనసు మనమాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మంచి చెడు ల విచక్షణ కల్పించే జ్ఞానాన్ని సదారక్షించుకోవాలి.కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది. అంతటి ధన సంప న్నుడూ ఎవరికీ ఎక్కడా దాన ధర్మాలు చేసిన కథలు కనిపిం చవు. అందువల్ల కుబేరుడికి భక్తులుండరు.సిరుల దేవత శ్రీమహాలక్ష్మినిఎందరోఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎం దుకంటే ఆమహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.
ప్రపంచంలో కుబేర సమాను లెంతమంది ఉన్నాసత్కార్యా లు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు.కాబట్టి, తన సంపదను పంచడంతో పాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి అవధు లెరుగని దాత అనిపించుకోదగినవాడు. భగవంతుడొక్కడే. ఆయనదాతలకేదాత.ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపద లు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు. అసలు సత్యమే మిటంటే, మనలోని సంస్కా రం ఒక్కో మెట్టు ఎదగాలి. సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూ య, ద్వేషాలుఉండవు.తులసి మొక్క సర్వలోక పూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుం ది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ,తులసిమొక్క పవిత్రత ముందు అది ఎందు కూ కొరగాదు. అభివృద్ధి సోపా నాలు ఎక్కడానికి ఆరాట పడ టంకంటేమనఅర్హతలుపెంచుకు నేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరో ధం కనుక, ఆ భావాన్ని మన లోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సం స్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం.