జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపిన దోమకొండ జర్నలిస్టులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; 06 (అఖండ భూమి న్యూస్);
నిజాంసాగర్ సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతి పట్ల దోమకొండ ప్రెస్, క్లబ్ టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు ముదాం శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం దోమకొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, అబ్రబోయిన శ్రీనివాస్, బిజెపి మాజీ అధ్యక్షుడు చింతల రాజేష్, కర్రోల శ్యాంసుందర్ గౌడ్, జర్నలిస్టులు అందే గణేష్, అల్లె రవి, సాప శ్రీనివాస్, అబ్ర బోయిన శ్రీనివాస్, దేవోళ్ళ రాము, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


