బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్ ప్రతినిధి

అఖండ భూమి న్యూస్ జూలై 21

నర్సాపూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు పాల్గొన్నారు. వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా నడిచి బోనాలు సమర్పించారు. అనంతరం స్థానికులతో మాట్లాడిన ఆయన, ఈవేళ పల్లెల్లో, పట్టణాల్లో మన సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి జాతరలు ఎంతగానో అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!