◾ ఏపీలో దారుణం … జేసీబీ లతో దేవుడు విగ్రహాలు కూల్చిన ప్రభుత్వ అధికారులు

 

◾ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకొని అనంతపురం జిల్లా పోలీసులు.

 

అర్థరాత్రి సమయంలో అనుమతి లేకుండా దేవుడు విగ్రహాలు ఇలా కూల్చడం పై పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ▪️అనంతపురం జిల్లా లో టవర్ క్లాక్ వద్ద ఉన్న వాసవీ ఆలయ ఆర్చ్ కూల్చివేత వివాదాస్పదమవుతోంది. ▪️సోమవారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి సుమారు 11 గంటలకు జేసీబీ లతో ఆర్చ్ ను రోడ్ విస్తరణలో భాగంగా కూల్చి వేశారు. ▪️కాకపోతే దేవతా విగ్రహాలను కూడా జేసీబీ లతో కూల్చి నందుకు విగ్రహాలు కింద పడి పగిలిపోవడం తో ప్రజలు ఆవేదనకు గురి అవుతున్నారు. ▪️దేవతా విగ్రహాలను మాత్రం తాళ్లతో కట్టి కిందకు దించలేదు అంటూ అనంతపురం జిల్లా వాసులు ఆందోళనా వ్యక్తం చేస్తున్నారు. ▪️ ఇదే రోడ్డు లో సప్తగిరి సర్కిల్ లో ఉన్న మజీద్ మాత్రం కోర్ట్ లో కుల్చకుండా ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారు. ▪️ ఈ గుడి కూల్చివేత పై వైసీపీ మేయర్ మౌనంగా ఉండడం పలు వివాదాలకు దారి తీస్తాయి అంటూ అనంతపురం జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ▪️ దేవత విగ్రహాలు ఇలా కూల్చడం సరైన నిర్ణయం కాదు దీని పై మేయర్ మరియు జిల్లా ఎమ్మెల్యే స్పందించాలి అంటూ పలు సంఘాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. ▪️వెంటనే ప్రభుత్వ అధికారులు పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!