55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు : పీఎం జన్ ధన్ యోజన…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు5 (అఖండ భూమి న్యూస్);
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేద ప్రజల ద్వారా బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారి సంఖ్య 55 కోట్లు దాటింది. ఈ ఖాతాలకు ఇప్పుడు (కేవైసీ) అప్ డేట్ అవసరమని, దీనికోసం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 56% ఖాతాలు మహిళలలు ఉన్నాయని, ఖాతాల్లో డిపాజిట్లు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని వెల్లడించారు.



