సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్
( మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7)
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చేగుంట మండలం లో వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర హాస్టల్ ను . గురువారం ఆద న పు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బోధన, నీరు , ఆహారం, సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థినిలను పలు ప్రశ్నలను అడిగారు. ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉందని, ఉన్నత చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని, చదువుతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్) కూడా ఉంటేనే అనుకున్న ఉద్యోగం వస్తుందని వివరించారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ఒక ఆయుధమని, లక్ష్యాన్ని పెట్టుకొని ప్రణాళికతో చదవాలని అన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
ప్రపంచ స్తన్యపాన వారోత్సవం సందర్భంగా బాలల వైద్యశాఖ, ఎం సి హెచ్ , జీఎంసీ మేడక్ వారు స్తన్యపాన ప్రాముఖ్యతపై అవగాహన