అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్ట్ 9 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని అడవి లింగాల గ్రామ శివారులో గల ట్రాన్స్ఫార్మర్ దగ్గర శనివారం నాడు విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలో ఊర్లోకి సరఫరా అయ్యే బోరు బావి సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఎత్తు తక్కువగా ఉండడం వళ్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అడవి లింగాల గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం కు చెందిన ఆ రెండు మేకలు మృతి చెందడంతో ఆయనకు దాదాపు 30 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని, బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పోలీసు రాజుకు సంబంధించిన ఎద్దు మృతి చెందినట్లు తెలిపారు ప్రమాదకరంగా ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ ఎత్తు పెంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



