పాకిస్తాన్ ఉగ్ర దేశం అని మరోసారి రుజువైంది”
— విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 12.(అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజు విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్నా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారతదేశాన్ని ఉద్దేశించి అణు బెదిరింపులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు
“భారత్పై అణు బాంబుల దాడి చేస్తామని ప్రకటించడం పాకిస్తాన్ యొక్క రూపం ఇతర దేశాలు అర్థం చేసుకోవాలన్నారు ఉగ్రవాద దేశంగా స్పష్టమైన నిదర్శనం. ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అసలు ముఖచిత్రం ప్రపంచానికి మరోసారి బహిర్గతమైంది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వినయ్ కుమార్ ప్రపంచ దేశాలను డిమాండ్ చేశారు.
ఇటువంటి బెదిరింపులకు భారతదేశం భయపడేది లేదని, ప్రతిస్పందించాల్సి వస్తే పాకిస్తాన్ను నేలమట్టం చేసే శక్తి భారత్కు ఉందని ఆయన హెచ్చరించారు. “భారత యువత దేశ భద్రత కోసం ఏ సమయంలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉంది అన్నారు
ఈ సమావేశంలో విద్యార్థి సేన నాయకులు రాహుల్,దినేష్, మధు, గోపాల్, నవీన్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



