జర్నలిస్టుల కు ఉచిత వైద్య శిబిరానికి అక్రిడేషన్ ప్రామాణికం కాదు ….కలెక్టర్ ఢిల్లీ రావు

 

విజయవాడ, కలెక్టరేట్.

దీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చొరవతో నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులకు 1&P R నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలు వినియోగం..నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో తమ ఆరోగ్యం సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసే జర్నలిస్టుల ఆరోగ్యం నామమాత్రం.. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలను ఉపయోగించుకోవటానికి అక్రిడేషన్ ప్రామాణికం చేయటాన్ని.. ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించింది.. ఈ సమస్యపై ది. ఏ. పి.జే. ఏ వ్యవస్థాపక అధ్యక్షులు చందన మధు *ఆరోగ్యాన్ని అక్రిడియేషన్* తో ముడి పెట్టవద్దు అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీ రావుని కోరారు..ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు సైతం ఈ సేవలను వినియోగించుకోవచ్చు అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే. శ్రీనివాసరావు, సెక్రటరీ దాసరి జోసఫ్, ట్రెజరర్ కే సర్వారవు, జాయింట్ సెక్రెటరీ వెంకట్ పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!