మిస్సింగ్ కేసు నమోదు…?

కర్నూలు జిల్లా, వెల్దుర్తి మే 12 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో నివాసముంటున్నటువంటి బెస్త రాముడు కనబడడం లేదని భార్య బేస్తా అశ్విని ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి పట్టణంలో ని సుబ్బయ్య క్యాంటీన్లో పనిచేసేవాడని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు సెల్ ఫోన్ రింగ్ అయింది ఆ తర్వాత స్విచ్ ఆఫ్ లో ఉందని భార్య అశ్విని పేర్కొంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవని ఫిర్యాదులో పేర్కొంది. మా ఇరువురికి వివాహం అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు అయ్యిందనీ పోలీసులకు తెలిపారు. మా ఇద్దరి వివాహ ఫలితంగా రెండు సంవత్సరాల కూతురు ఉందని తెలిపారు. నా భర్త ఎక్కడున్నా నాకు వెతికి ఇప్పించగలరని ఫిర్యాదులో పేర్కొంది. భార్య బేస్తా అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!