భారీ వర్షాలకు కూలిన ప్రహరీ గోడ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలకు సంబందించిన గోడ కర్షక్ బీ.ఈడి వెనుక సైడ్ గోడ కూలీ పోయింది. గతంలో మూడుసార్లు కూలీ పోవడం వల్ల కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి వస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా కూలిన గోడను సందర్శించారు. గోడ కులడంతో సత్వరమే మున్సిపల్ అధికారులకు, డిగ్రీ కళాశాల, శిశు మందిర్ సిబ్బందికి సమాచారం అందించారు. సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియా కోరారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ కు ఫోన్ లో వివరించగా, సోమవారం సాయంత్రం 6గంటలకు సమావేశం అయి పూర్తి స్థాయి పరిష్కారం చేయాలనీ కోరారు. ఈ సమావేశంకు డిగ్రీ, కర్షక్ కళాశాల, శిశు మందిర్, కాలనీ వాసులు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఘటన స్థలంకు చేరిన డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్స్పాల్ కిష్టయ్యను కాకతీయ నగర్ కాలనీ వాసులు, 14వ వార్డ్ ప్రజలు నిలదిశారు. డిగ్రీ కళాశాల, కర్షక్ బీ.ఈడి కళాశాల, శిశు మందిర్ తీరు పట్ల కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు ఆందోళన చేశారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


