షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి సమస్య అధికంగా ఉండడంతో షబ్బీర్ అలీ సహకారంతో అధికారంతో మాట్లాడి శనివారం క్లాసు ఫార్మర్ బిగించే విధంగా చర్యలు చేపట్టారు. మోటార్లు కాలిపోతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ దృష్టికి రైతులు తీసుకెళ్లగా తక్షణమే ఎస్ ఈ శ్రావణ్ కుమార్ తో మాట్లాడి 100కెవి నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు ఇప్పించారని ట్రాన్స్ఫార్మర్ బిగింపచేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న
లో ఓల్టేజి ఇబ్బందులు తెలుపగానే సత్వరమే సమస్య తీర్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ కిషన్, రైతులు చంద్రాగౌడ్, తలారి ప్రభాకర్, శంకర్, దేవి, రాములు,రంజిత్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష



