ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 25 (అఖండ భూమి న్యూస్)
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి శనివారంలోగా వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నుండి ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 92 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం పై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అందుకు తగ్గట్టు వివిధ శాఖలకు అందిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిశీలించి శనివారంలోగా వివరాలను అందజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


