ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 25 (అఖండ భూమి న్యూస్)

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి శనివారంలోగా వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నుండి ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 92 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం పై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అందుకు తగ్గట్టు వివిధ శాఖలకు అందిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిశీలించి శనివారంలోగా వివరాలను అందజేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!