గోమయ గణపతి మరింత శ్రేష్టం..!

కవి లెక్చరరు ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 25,(అఖండ భూమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల కు చెందిన కవి లెక్చరర్ ఉమశేషారావు గోమయ అవుపేడతో తయారు చేసిన గణపతి తో మనం పూజ చేస్తే అనారోగ్యం తొలిగి,సర్వ పీడనలు తొలిగి,విద్యార్థులకు అఖండ విద్యా సిద్ధిస్తుంది. ,సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది అని,గోమాత లో ముక్కోటి దేవతలు ఇమిడి ఉన్నారు. చవితి రోజు అవుపేడతో తయారు చేసుకొని,మనసులో సంకల్పం చెప్పుకొని నమో వక్రతుండాయ అంటూ 108 ప ర్యాయములు కానీ 1008 జపం చేసుకొని, గంధపుష్పములు సమర్పిస్తే చాల పుణ్యప్రదం అని శాస్త్రం చెప్పుతుంది..ఇది చెట్టు కింద పెట్టిన కంపోస్టు ఎరువుగా మొక్క ఎదుగుదలకు, తోడ్పడితుంది.నీళ్లలో నిమజ్జనం చేసిన సులభంగా కరిగి నీటిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.ఈ గోమయ గణపతి తయారు చేసుకొని భాద్రపద చవితి రోజున గాని,ప్రతి చవితి,సంకష్ట చతుర్థి రోజు నిర్వహించుకోవచ్చు. అర్ధమండలం 21 రోజు ఏ రోజు కు ఆ రోజు తయారు చేసుకోవాలి.దీని వలన సమస్త కష్టములు తొలిగి సుఖ సంపదలు పొందగలరు. గోమయ గణపతి తో మరింత శ్రేష్టం అని తాను దానినె వినాయక చవితి రోజు పూజిస్తున్నాను అని కవి,లెక్చరర్ ఉమాశేషారావు చెప్పారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


