మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 22.(ప్రజాజ్యోతి)
కామారెడ్డి జిల్లాలో ఇటీవల గ్రాండ్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి దొరికిన 29 మందికి శిక్షతోపాటు జరిమానాలను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సోమవారం విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 29 మందిలో నలుగురికి ఒకరోజు శిక్షతోపాటు మరో 25 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని వారికి సూచించారు.



