ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో ఈనెల 2న ప్రారంభమైన ఎల్లమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం ఉదయం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్ని వాడాల నుండి బోనాలను తీసి డప్పు వాయిద్యాలతో, శివసత్తులు నాటి నృత్యములతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నాలుగవ తేదీన చక్కర తీర్థం, జాతర ఉత్సవాలు, ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు మిద్దె రామ గౌడ్ మనవడి మిత్ర బృందంతో ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముదిరాజ్ జాతి హక్కుల సాధనకై నిరంతర ఉద్యమం..!


