సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
సిఐటియు ఆధ్వర్యంలో డిపిఓ కార్యాలయంలో ఆందోళన చేసిన జీపీ కార్మికులు చంద్రశేఖర్ మద్దతు*
– ఇబ్బందులకు గురి అవుతున్న గ్రామపంచాయతీ కార్మికులు
– పెద్దల పండుగ చేయాలంటే ఇబ్బందులు పడ్డాం
– ముందు బతుకమ్మ,, దసరా పండుగలు ఎలా చేసుకోవాలి
– ఆవేదన వ్యక్తం చేసిన గ్రామపంచాయతీ కార్మికులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 22 (అఖండ భూమి న్యూస్)
చాలీచాలని వేతనాలతో ఎవరు చేయని, చేయలేని పనులైన మల, మూత్ర విసర్జనాలు చేసే మోరీలను డ్రైనేజీలను శుభ్రం చేస్తున్న గ్రామపంచాయతీల బాధలు వర్ణనాతీతం. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం సిఐటియు జిల్లా అధ్యక్షులు కందూరు చంద్రశేఖర్ తో కలిసి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఏసీలలో కూర్చొని విధులు నిర్వహించే అధికారులకు గత ప్రభుత్వంలో 15, 20 రోజులు ఆలస్యంగా వేతనాలు వేస్తేనే వారు గగ్గోలు పెట్టారు. అలాంటిది చాలే చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తే వారు ఎలా కుటుంబాలను పోషించుకుంటారని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుండగా కామారెడ్డి డి ఎల్ పి ఓ శ్రీనివాస్ అక్కడికి వచ్చి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చిన తర్వాతనే ఇస్తాం మీరు ఏం చేసినా లాభం లేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కార్మికులను దురుసుగా మాట్లాడారు. ఎంపీ వలన పిలిపిస్తాం మాట్లాడతాం, పై అధికారులకు సమాచారాన్ని అందిస్తామని చెప్పడంతో కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు వచ్చి ఇక్కడ ఆందోళన చేయవద్దని కార్యాలయం బయటనే ఆందోళన చేయాలని ఐదుగురు వచ్చి మాత్రమే అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని అనడంతో సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాత్రం ఎక్కడికైనా వచ్చే ఏమైనా మాట్లాడొచ్చా అని, ఎవరు చేయలేని విధులను ఈ గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్నారని, అలాంటి కార్మికుల పట్ల అధికారులు దొరుకుగా ప్రవర్తించడం దురుసుగా సమాధానం చెప్పటం ఏమిటన్నారు. దీంతో పోలీసులకు కార్మికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న వారు ఎస్సీ ఎస్టీ బీసీలు కావడంతోనే వారి పట్ల అధికారుల చిన్న చూపు చూస్తున్నారన్నారు. ముందు బతుకమ్మ పండుగ దసరా పండుగ ఉందని వాటికి మేము ఎలా ఖర్చులు చేసుకోవాలి డబ్బులు ఎక్కడినుండి తెచ్చుకోవాలి అని కార్మికులు పేర్కొంటున్నారు ఒక నెల వేతనమైన ఈ నెల ఇవ్వాలన్నారు.
ఈనెల 28 వరకు వేతనాలు ఇచ్చేలా చూస్తాం. ( జిల్లా పంచాయతీ అధికారి మురళి )
జిల్లా పంచాయతీ అధికారి వచ్చే వరకు ఇక్కడ నుంచి మేము లేచేది లేదని కార్మికులు బిస్మించుకొని కూర్చోవడంతో అక్కడికి వచ్చిన జిల్లా అధికారి మురళి మాట్లాడుతూ టాక్సులు వసూలు చేసుకుని వేతనాలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 32 జిల్లాలలో పరిస్థితి ఇలాగే ఉందని రాష్ట్రమంతటా వచ్చిన సమయంలోనే కామారెడ్డి జిల్లాకు వస్తాయని, అంతవరకు ఓపిక పట్టాలన్నారు.
గ్రామాలలో టాక్సీల కోసం వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారని కార్మికుల పేర్కొనడంతో ఒక నెల వేతనం ఈ నెల 28 వరకు ఇప్పిస్తానని కార్మికులకు మాట ఇచ్చారు. దీంతో కార్మికులు జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం ఇచ్చే వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాల్ నర్సు కార్యదర్శి శ్యామ్ ఉపాధ్యక్షులు అంజవ్వ బాల్నర్సు దత్తురామ్ స్వామి రవి రాజయ్య నగర్ రామారెడ్డి మాచ రెడ్డి పాల్వంచ బిక్నూర్ బీబీపేట్ దోమకొండ లింగంపేట్ తాడ్వాయి గాంధారి మండలాల గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.