తారక మంత్రం అంటే ఏమిటి..?
కవి,లెక్చరర్ ఉమశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24,(అఖండ భూమి న్యూస్).
భారతీయ ఆధ్యాత్మిక సంస్కృ తిలో మంత్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి మంత్రం కీలకమైందని యజు ర్వేదం చెబుతోంది. మనం దైవానికి చేసుకొనే విన్నపాలు మంత్రంలోని బీజాక్షర శక్తి కారణంగా నేరుగా చేరతా యన్నది పౌరాణికుల భావన.
పూర్వ కాలంనుంచీ వైదిక మంత్రాలను మూర్తిలోకి దైవ త్వాన్ని ఆవాహన చేసేందుకు ప్రయోగించడం సంప్రదాయం.
మూర్తిలోకి అంటే మన హృద యంలోకి అనే భావార్థమూ ఉంది. మంత్రాలు మౌలికంగా ప్రచలిత సంహితాలు. ఏ మంత్రాన్నైనా ఓం అక్షరం చేర్చి ఉచ్చరిస్తే ఆ మంత్ర ధ్వని సత్య వ్యక్తీకరణకు కారణమ వుతుందని మంత్రోపనిషత్తు వివరిస్తోంది. మంత్రాలన్నింటికీ భిన్నమై, మానసాన్ని భక్తికి గురిచేసే మంత్రం తారక మం త్రమని రామ రహస్యో పనిష త్తు తెలుపుతోంది. శ్రీరామ నామమే తారకమంత్రం.
శుక్ల యజుర్వేదానికి చెందిన అద్వయ తారకోపనిషత్తులో తారక మంత్రం మహత్తు గురించిన సంపూర్ణ వివరణ ఉంది. తొలుత ఈ మంత్రం శివుడు పార్వతికి ఉపదేశించి నట్లు చెబుతారు. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే’ అన్నదే తారక మంత్రం. కుండలినీ శక్తికి రా అనేబీజాక్షరమేమూలాధారమని స్యావన స్మృతి వెల్లడిస్తోంది మ అనే బీజాక్షరం సహస్రార చక్రాన్ని చైతన్యపరుస్తుంది. రామ అనే నామాన్ని పలికి నంతనే కుండలినీ శక్తి సర్పం ఆకారంలో పడగెత్తి కపాలాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తుంద ని ఈ స్మృతి వివరిస్తోంది.
యోగిగా మారే యోగ్యత కోసం మానవుడు సదా ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండా లని పార్వతికి శివుడు చెప్పా డంటారు. ధరణిలోని మాన వుడి ధన్యత కోసం రెండు మంత్రాలు అమేయమైనవని వసిష్ఠుడు దశరథుడితో అంటాడు. ఒకటి ప్రణవం, మరోటి రామ శబ్దం! అందుకే వసిష్ఠుడు దశరథుడి పెద్ద కుమారుడికి శ్రీరామ అని నామకరణం చేశాడట.రామ రహస్యోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినది. శ్రీరామ అనే పదంలోనే విశ్వా ల ఆవిర్భావానికి కారణమైన రహస్యం ఉందని సప్తర్షుల్లో ఒకడైన గౌతముడు తాను రాసినధర్మశాస్త్రంలోవివరించాడు. అగస్త్యుడు రామ రహ స్యోపనిషత్తును హను మం తుడికి ఉపదేశించాడంటారు.
స్వాయంభువ మన్వంతరంలో మానవులందరి నిజ నామం చివర ‘రామ’ అని ఉండేదట.
అలా ఒకరినొకరు పిలుచు కునేందుకు అనుకోకుండానే రామ నామం పలికేవారు. అందుకే ఆ మన్వంతరంలో నరకంలో పని లేక యముడు సదా నిద్రలోనే ఉండేవాడన్నది కథనం.కాశీ క్షేత్ర స్థల పురా ణాన్ని అనుసరించి- మానవు డు తనువు చాలించే ముందు అతడి కుడిచెవిలో విశ్వనాథు డుతారకమంత్రంఉపదేశిస్తాడన్నది ఒక నమ్మకం.రాముడు తన వంశానికి చెందినవాడని సూర్యుడికి గర్వమట. భూమి పై శ్రీరామనవమి ఉత్సవాలు చూసేందుకు సూరీడు అందుకే ఒకింత కిందికివస్తాడట.అందు వల్లే ఆ సమయంలో ఎండలు మండుతాయన్నది ఒక కవి హృదయం!అష్టాక్షరిలోని రా అక్షరం, పంచాక్షరిలోని మ అక్ష రం.ఈ రెండు జీవాక్షరాలూ కలిసి రామ అయిందని పౌరా ణికుల వ్యాఖ్య!అలా తార కమంత్రం ఉచ్చరించినంత మాత్రాన శివకేశవులు సంతు ష్టులవుతారట.శ్రీరామకృష్ణ పరమహంస తొలుత నరేంద్రుడికి తారక మంత్రమే ఉపదేశించాడు. ఆ తరవాతే నరేంద్రుడువివేకానందుడయ్యాడు. కబీరు గురుబోధన తో తారకమంత్రం లభించిన కంచర్ల గోపన్న ‘తారక మంత్ర ము కోరిన దొరికెను. ధన్యుడ నైతిని’అంటూధన్యాసిరాగంఆలపించాడు. ‘రమించు వారెవరురా-రఘోత్తమా నిను వినా’‘మనవినివినుమా-మరువసమయమా’జయనారాయణిఅంటూ ఆర్ద్రతతో రాముణ్ని స్మరిస్తూ త్యాగయ్య నాద యోగం సాధించాడు. తారక మంత్రంలోని మహత్తు అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…