సీఎం సభ ఏర్పాట్లపై పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర…

సీఎం సభ ఏర్పాట్లపై పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 10 (అఖండ భూమి న్యూస్) జిల్లాలో ఈనెల 15న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లును పరిశీలించి, పోలీసు అధికారులకు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ బుధవారం సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతం, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు మరియు వీఐపీ రాకపోకల మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.

ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణ, వి.ఐ.పి రాకపోకలు, భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, దిశా సూచికలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి , కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, , కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ , దేవునిపల్లి ఎస్సై తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!