రిజర్వేషన్ల జోలికి వస్తే లంబాడీల సత్తా చూపిస్తాం…
అనిల్ నాయక్ – ( లంబాడి ఐక్యవేదిక యూత్ ఇంచార్జి కామారెడ్డి జిల్లా)..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 14 (అఖండ భూమి న్యూస్) బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ఆదివాసీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని ఆదివారం *కామారెడ్డి జిల్లా లంబాడీ ఐక్యవేదిక యూత్ ఇన్చార్జి అనిల్ నాయక్ ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆదివాసి నాయకులు స్వలాభం కోసం గిరిజనుల మధ్య తగాదాలు పెట్టొద్దని సూచించారు. బంజారా నాయకుల మీద చేస్తున్న దుష్పర్చారాన్ని మానుకోవాలన్నారు. బంజారాలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తొలగించాలన్న ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించే న్యాయమైన హక్కుల కోసం లంబాడీలు కట్టుబడి తన ఆకులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లంబాడి హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…



