ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం…
రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 14 (అఖండ భూమి న్యూస్)
ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మైనారిటీ ఫంక్షనాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగిందని ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీన్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ లు పేర్కొనడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు,జమీల్ లు మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని లేవని రక్తదానం పట్ల అపోహలను విడనాడి రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.మహమ్మద్ ప్రవక్త బోధించిన నీతి న్యాయం ధర్మం సమాజ సేవ అనే సూత్రాలను నిజజీవితంలో పాటించి సన్మార్గంలో నడవాలని అన్నారు సేవా మార్గంతోనే మానవ జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు గయాజుద్దీన్ మరియు కమిటీ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ శిబిరంలో 22 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యకులు ముక్రం, సయ్యద్ మీర్,అజీజ్ రెహమాన్,అహ్మద్ పాషా,కమిటీ సభ్యులు,ముస్లిం యువత పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



