జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ…
– బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశానుసారం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17. (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మరియు బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ ఆదేశానుసారం బుధవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది.
జాతీయ జెండా ఆవిష్కరణ ను బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.