బిబిపేట్ లో దిగ్విజయంగా గాయత్రి మహా యజ్ఞం…

బిబిపేట్ లో దిగ్విజయంగా గాయత్రి మహా యజ్ఞం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 30 (అఖండ భూమి న్యూస్) శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు శ్రీ నగరేశ్వర దేవాలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో” గాయత్రి మహా యజ్ఞం” దిగ్విజయంగా పండితులు శ్రీ చిద్గుణ శర్మ , శ్రీ మనోజ్ పాండే ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని మంగళవారం విజయవంతం చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారు కోరుకున్న కోరికలను తీర్చాలని వేడుకున్నారు.

తదనంతరం తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద కార్యక్రమం అందరికీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘంతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!