తెలంగాణ రైతు సంఘం కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాట
– అధ్యక్షులుగా దొడ్లి మోహన్
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 10 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రైతు సంఘం కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన దొడ్లి మోహన్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి దశరథ్, ఉపాధ్యక్షులుగా మోతి రామ్ నాయక్, సురేష్ గొండ, నర్సింలు, సహకార దర్శులుగా ఉప్పల సాయిలు, మధు, బన్సీలాల్ తోపాటు 12 మంది సభ్యులుగాను ఎన్నుకోవడం జరిగిందన్నారు. రైతుల పక్షాన పోరాటాలు చేసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీ రాబోయే మూడు సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఉపాధ్యక్షులు మోతి రామ్ నాయక్ తెలిపారు.


