కామారెడ్డి *భగత్ సింగ్ సిండికేట్ నూతన కార్యవర్గం ఎన్నిక…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11 ( అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో ఆదివారం నూతన భగత్ సింగ్ సిండికేట్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.ప్రభుదేవ్, గౌరవ అధ్యక్షుడు కాసర్ల స్వామి, కార్యదర్శి దేవసేన పటేల్, ఉపాధ్యక్షుడు పి. ప్రభాకర్ రెడ్డి, క్యాషియర్ ఉపేందర్, సలహాదారులు గోవిందరావు,నీలం రాజలింగం,కే. శ్రీకాంత్, శ్రీనివాస్, నరేందర్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారు కాలనీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ సభ్యులు పాల్గొన్నారు.


