కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే

 

 

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై రాజీ కుదిరిందని, దాదాపు నాలుగు రోజుల నుంచి ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడిందని వార్తలు వస్తున్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు..

 

గురువారం సాయంత్రం 7 గంటలకు క్వీన్స్ రోడ్‌లోని ఇందిరా గాంధీ భవన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరు కావాలని కోరారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని, డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. వీరు ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు ఆ పదవిని డీకే శివ కుమార్ నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు..

Akhand Bhoomi News

error: Content is protected !!