విశాఖలో చంద్రబాబు కు అపూర్వ ఘన స్వాగతం…
భారీగా తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు..
విశాఖపట్నం అఖండ భూమి వెబ్ న్యూస్ :
విశాఖలోని మూడు రోజులు పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి అపూర్వ ఘన స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గణబాబు పల్లా శ్రీనివాసరావు పాటు తెదేపా నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికి పెందుర్తికు తరలి వెళ్లారు. మార్గం మధ్యలో గణబాబు నివాసం వద్ద చంద్రబాబు ఆగి గణబాబు కుమారుడు మౌర్య సింహను శుభాకాంక్షలు తెలిపారు. దారి పొడవునా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుకు సాగారు. పెందుర్తి కోడేలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో జన సముద్రం కనిపించింది. రాత్రికి సమీపంలో గల చీమలపల్లి లోని కళ్యాణ మండపం వద్ద చంద్రబాబు బస ఏర్పాటు చేశారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…